మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి ఉపేంద్ర(32), తిరుపతమ్మ(32) దంపతులు. వీరికి శ్యామల(8), బిందు(6) అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
అయితే శుక్రవారం రాత్రి తిరుపతమ్మ బట్టలను జీఐ వైర్ పై ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. ఇది గమనించిన భర్త ఉపేంద్ర భార్య ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాడు. అతనికి కూడా విద్యుత్ షాక్ తగలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరి అంత్యక్రియలను శ్యామల, బిందునే చేశారు..
తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో శ్యామల, బిందు ఇద్దరు అనాథలయ్యారు. ఈనేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
Request @WCDTelangana and @Collector_MBD to take care of these two children https://t.co/FYKyDKLtl3
— KTR (@KTRTRS) November 22, 2021