సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని రాజు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లాలోని ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. అతడి చేతిపై మౌనిక అనే పేరుతో ఉన్న పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. దీంతో ఆరేళ్ల చిన్నారి చైత్ర ఆత్మ శాంతించింది. చైత్రపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హతమార్చిన రాక్షసుడు సరిగ్గా వారం రోజులకే ప్రాణాలు విడిచాడు.
పల్లకొండ రాజు అనే వ్యక్తి చిన్నారి చైత్రకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. అనంతరం శవాన్ని గదిలో ఉంచి తాళం వేసి పారిపోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షలు రివార్డు కూడా ప్రకటించారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రాజు చివరికి స్టేషన్ ఘన్ ట్ కేసర్ రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించాడు.
ఈక్రమంలో హీరో మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఈ వార్త విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఉన్నాడు’ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. మనోజ్ ఇటీవల చైత్ర కుటుంబాన్ని పరామర్శించిచన సంగతి తెలిసిందే.. ఈ సమయంలో ఆయన మీడియాపై కూడా ఆగ్రహానికి గురయ్యారు.
Thank you for the news sir.. God is there … #OmShantiChaitra #Chaitra https://t.co/hhe0UxFVNd
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 16, 2021