త్రిషను అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్.. ఏం చేసిందో తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ త్రిష.. తన అందం, నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో నటించింది.  తెలుగులోనే కాదు.. తమిళంలోనూ స్టార్ హీరోలతో చేసింది. అయితే గత కొంతకాలంగా ఆమె కెరీర్ కొంచెం స్లో అయింది. దీంతో ఆమె వయస్సుకు తగ్గ పాత్రల్లో నటిస్తూ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. 

ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్ సినిమాలో నిటిస్తోంది. ఈ సినిమాలో విక్రమ్ కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇండోర్ లో జరుగుతోంది. 

కాగా, ఈ సినిమా షూటింగ్ సందర్భంగా నటి త్రిష, దర్శకుడు మణిరత్నం వివాదంలో చిక్కుకున్నారు. వారిద్దరినీ అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వారిని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇంతకు త్రిష ఏం చేసిందంటే.. షూటింగ్ లో భాగంగా త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు.

అయితే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే దేవుళ్ల విగ్రహాలు ఉన్న ప్రాంతానికి త్రిష చెప్పులు ధరించి రావడాన్ని హిందూ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. త్రిష, దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదు చేయాలని హరికేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

Leave a Comment