మగధీర-2 రంగం సిద్ధం.. హీరో ఎవరో తెలుసా?

తెలుగు సినిమా రాజసాన్ని నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. తాను తీసే ప్రతీ సినిమాను ఎంతో జాగ్రత్తగా, అద్బుతంగా ఓ బండరాయిని అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దె ఒక గొప్ప శిల్పిలాగా చెక్కుతాడు. అందుకే ఆయన సినిమాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఖండాతర ఖ్యాతి గడించాయి. భారతీయ సినిమా రంగాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. 

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాచ్ చరణ్ లతో ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొమరంభీంగా జూనియర్ ఎన్టీఆర్ లుక్ మరియు అల్లూరి సీతరామ రాజుగా రామ్ చరణ్ లుక్ కి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. 

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతోంది. రాజమౌళి రామ్ చరణ్ తో చేసిన మగధీర సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిందో అందరికి తెలిసిందే.. రామ్ చరణ్, రాజమౌళి ఇద్దరికీ ఈ సినిమా తర్వాత కెరీర్ లో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన రాజమౌళికి ఎప్పటి నుంచో ఉంది. ఈ సీక్వెల్ స్టోరీని కూడా రెడీ చేసుకున్నాడు. ఈ స్టోరీని రామ్ చరణ్ కి వినిపంచాడని, ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ఇండస్ట్రీలో టాచ్ వినిపోస్తుంది. ఇదే కాని నిజం అయితే రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలు రాయిగా నిలిచే సినిమా రాబోతుందని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు..

Leave a Comment