ఫొటో తీసిపంపినా జరిమానా.. మాస్క్ విషయంలో కఠినంగా ఏపీ ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూలో సడలింపులు చేసింది. అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ సడలించింది. కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. రాత్రి 9కల్లా అన్ని దుకాణాలు మూసివేయాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అన్ని జిల్లాల్లో ఒకే విధమైన కర్ఫ్యూ అమలుకానుంది. 

కోవిడ్ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారుల వరకు మాస్క్ లు ధరించాల్సి ఉంటుంది. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2-3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. 

కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించే విధంగా దీని కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఎవరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతో పాటు మార్కట్లు, తదితర చోట్ల కూడా మాస్క్ లు ధరించాలంటూ ఆదేశించింది. 

Leave a Comment