షాకింగ్: తల్లి పిలుపుతో లేచి కూర్చున్న చనిపోయిన కొడుకు..!

ఎవరి ప్రాణాలైనా కాపాడాలనుకుంటే.. ఎవరికైనా జీవితం ఇవ్వాలనుకుంటే.. ఆ పరమేశ్వరుడు ఏ రూపంలో అయినా రావచ్చు. అవును ఇది ఒక అద్భుతమే జరిగింది. దేవుడు తల్లి పిలపును విన్నాడు. అంత్యక్రియలకు సిద్ధమైన వేళ ‘లే.. కన్నా లే’ అంటూ ఆ తల్లి రోధించింది. ఆ తల్లి పిలుపును ఏ దేవుడు విన్నాడో మరికాసేపట్లో మట్టిలో కలిసిపోయేందుకు సిద్ధమైన ఆ చిన్నారి లేచి కూర్చున్నాడు. ఈ ఆశ్చర్యమైన ఘటన హర్యానాలో జరిగింది. 

ఏం జరిగిందంటే.. హర్యానాలోని బహదూర్ గఢ్ ప్రాంతానికి చెందిన హితేష్, ఝాన్వి దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడికి టైఫాయిడ్ జ్వరం ఎంతకూ తగ్గక పోవడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే మే 26న ఆ పిల్లాడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో చిన్నారి మృతదేహాన్ని సొంతూరుకు తీసుకొచ్చారు. 

బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రాత్రంతా శవం వద్ద జాగారణ చేస్తూ తల్లిదండ్రులు గడిపారు. ఏడుస్తూ ‘లేచి కూర్చో నాన్నా’ అంటూ తల్లి పిల్లాడి మృతదేహాన్ని అటూఇటూ  కదిపింది. దీంతో పిల్లాడి శరీరంలో కదలిక కనిపించడంతో ఒక్కసారి ఆశ్చర్యపోయిన తండ్రి వెంటనే తేరుకుని పిల్లాడి శరీరాన్ని ప్యాకింగ్ నుంచి వేరు చేశాడు. వెంటనే నోటి ద్వారా శ్వాస అందించాడు. 

ఇక పొరింటి యువకుడు పిల్లాడి ఛాతీపై గట్టిగా ఒత్తడంతో ఒక్కసారి పిల్లాడి గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది. దీంతో చికిత్స నిమిత్తం పిల్లాడ్ని రోహతక్ ఆస్పత్రికి తరలించారు. పూర్తిగా కోలుకున్న బాలుడిని మంగళవారం ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయాడనుకున్న బాలుడు లేచి కూర్చోవడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

 

Leave a Comment