హోం వర్క్ అడిగినందుకు.. టీచర్ పై కాల్పులు..!

హోం వర్క్  సరిగా చేయాలని, తోటి విద్యార్థులతో స్నేహంగా మెలగాలని చెప్పిందు టీచర్ పై స్టూడెంట్ కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఘజియాబాద్ లో చోటచేసుకుంది. వివరాల మేరకు కృష్ణ విద్యానికేతన్ స్కూల్ లో సచిన్ త్యాగి అనే టీచర్ ఇంటర్ విద్యార్థులకు కామర్స్ సబ్జెక్ట్ బోధిస్తున్నాడు. 

ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హోం వర్క్ సరిగా చేయడం లేదు. అంతే కాకుండా తరగతి గదిలో ఇతర విద్యార్థులతో ఘర్షణకు దిగుతున్నాడు. దీంతో టీచర్ ఆ విద్యార్థిని మందలించాడు. హోం వర్క్ సరిగా చేయాలని చెప్పాడు. దీంతో ఆ విద్యార్థి శనివారం మధ్యాహ్నం కాలేజీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న టీచర్ సచిన్ త్యాగిని ఆ విద్యార్థి ఫాలో అయ్యాడు. రోడ్డుపైనే టీచర్ పై కాల్పులు జరిపి పారిపోయాడు. టీచర్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో కింద పడిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. టీచర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతడికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

 

Leave a Comment