కాజల్ మైనపు బొమ్మను చూసి మురిసిపోయిన భర్త గౌతమ్ కిచ్లూ..!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే గతేడాది డిసెంబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.   

కాగా, సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అందాల చందమామ కాజల్ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు.  కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ఈ మైనుపు బొమ్మను చూసి మురిసిపోయాడు. అయితే మైనపు బొమ్మ ప్రదర్శించడానికి ఒక రోజు ముందుగానే టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు బొమ్మను చూశాడు.

తర్వాతి రోజు అఫిషియల్ గా కాజల్ మైనపు బొమ్మను టుస్సాడ్స్ మ్యూజియం వారు ప్రదర్శించగా ఆరోజు మాత్రం గౌతమ్ బిజినెస్ పని మీద జర్మనీకి వెళ్లాడు. కాగా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి దక్షిణాది కథానాయికగా కాజల్ పేరు సాధించింది. అంతకుముందు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్ మైనపు బొమ్మలు ఉన్నాయి.      

Leave a Comment