దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ డ్రై రన్ ను పరిశీలించడానికి ఓ హాస్పిటల్ కు వెళ్లిన ఆయన దేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.
వ్యాక్సిన్ ప్రజల ఆరోగ్యం కోసమేనని, అపోహాలను మనుసులో పెట్టుకోవద్దని కోరారు. వ్యాక్సిన్ భద్రత, సమర్థత, రోగనిరోధక శక్తి పెంపుదలపై రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. కొవిషీల్డ్ అత్యవసర వినియోగంపై డీసీజీఐ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతల్లో శనివారం నిర్వహిస్తున్నారు.
#WATCH | Not just in Delhi, it will be free across the country: Union Health Minister Dr Harsh Vardhan on being asked if COVID-19 vaccine will be provided free of cost pic.twitter.com/xuN7gmiF8S
— ANI (@ANI) January 2, 2021