ప్రాణం తీసిన వాటర్ హీటర్.. విద్యుత్ షాక్ తో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు మృతి..

వాటర్ హీటర్ ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. విద్యుత్ షాక్ తో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుళ్లెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు సతీష్, కవిత దంపతులు గ్రామంలో కిరాణ స్టోర్ నిర్వహిస్తున్నారు. 

శనివారం ఉదయం నీళ్లు కాచేందుకు వాటర్ హీటర్ పెట్టారు. ఆ వాటర్ హీటర్ కు ప్రమాదవశాత్తు కవిత(35) చేయి తగిలి విద్యుత్ షాక్ కు గురైంది. పక్కనే ఉన్న నిశ్చల్ కుమార్(10), వెంకటసాయి(8) తల్లిని పట్టుకోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే  మృతి చెందారు. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

Leave a Comment