జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన మహిళా ఉపాధ్యాయులను లైంగికంగా వేధించిన ఘటన యూపీలోని మీరట్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతే కాక టాయిలెట్ లో రహస్యంగా స్పై కెమెరాలు పెట్టి వారి అశ్లీల తీసి వారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. వివరాల మేరకు మీరట్ లోని సదర్ బజార్ లో రిషబ్ అకాడమీ పాఠశాల ఉంది. ఆ పాఠశాలను రంజీత్ జైన్ అతని కొడుకు అభినవ్ జైన్ నడుపుతున్నారు.
లాక్ డౌన్ సమయంలో పాఠశాలను మూసివేశారు. దీంతో పాఠశాలలో పనిచేస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయులు తమకు అందాల్సిన జీతాలను ఇవ్వలని పాఠశాల యాజమాన్యాన్ని కోరారు. అయితే రంజీత్ మరియు అభినవ్ లు మహిళా ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం లేదు. పైగా టాయిలెట్ రూంలో రహస్యంగా స్పై కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తు వేధించారు. తమతో చనువుగా ఉండాలని, లేకపోతే చేతబడి చేయించి చంపేందుకు వెనకాడమని బెదరించారు. దీంతో మహిళా ఉపాధ్యాయులు రంజిత్, అభినవ్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు.