కొడాలి నాని నాలుక చీరేస్తాం : బీజేపీ నేత

ఏపీ మంత్రి కొడాలి నాని నాలుక నిలువునా చీరేస్తామని శ్రీకాళహస్తి దేవాలయ మాజీ చైర్మన్, బీజేపీ నేత కోలా ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం, ఆలయాల మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు. మంత్రి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఏడాదికి ఒకసారి జట్టు, గడ్డం పెంచుకుని తిరుమల వచ్చి గుండు చేయించుకుని వెళ్లే కొడాలి నాని, తిరుమల గురించి తప్పుడు వ్యాఖ్యాలు చేస్తున్నారని కోలా విమర్శించారు. 

ఇటీవల తిరుమలకు వెళ్లేందుకు అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఏ గుడి, మసీదు చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఈ పద్ధతిని తొలగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్వేదిలో రథం కాలిపోతే కొత్తది పెట్టిద్దాం..దుర్గ గుడిలో రథం సింహాలు పోతే కొత్తవి చేపిస్తాం.. వంటి వ్యాఖ్యల పట్ల కోలా ఆనంద్ మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు రావడానికి వీల్లేదని కోలా ఆనంద్ హెచ్చరించారు.  

 

Leave a Comment