తమిళనాడులో సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. ప్రధాని మోడీ పేరుపై ఇడ్లీ అమ్ముతున్నారు. తమిళనాడులోని సేలం జిల్లాలో ‘మోడీ ఇడ్లీ’ పేరుతో హోటళ్లలో ఇడ్లీ అమ్ముతున్నారు. నాలుగు ఇడ్లీల ధర కేవలం 10 రూపాయలే అంటూ అక్కడి బీజేపీ నేత మహేష్ దీనికి శ్రీకారం చుట్టారు.
సేలం జిల్లాలోనే కాకుండా తమిళనాడు మొత్తం మోడీ ప్రభంజనం తీసుకురాాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నట్లు చెప్పారు. తమిళంలో మోడీ ఇడ్లీస్ అని రాయించిన పోస్టర్లను హోటళ్లపై ఏర్పాటు చేయించాడు. ప్రస్తుతం 22 చిన్నపాటి హోటళ్లలో వీటిని వినియోగదారులకు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచుతామని ఆయన చెప్పారు.