పురుషులకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. దీంతో వారు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపరు. ఇది వారి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఎదరవుతుంటాయి. అయితే అంగస్తంభన సమస్యలన అధికమించడానికి అనేక గృహ నివారణ చిట్కాలు ఉన్నాయి. వాటిలో వెల్లుల్లి అంగస్తంభన సమస్యకు సహజ నివారిణిగా ఉపయోగపడుతుంది. అంగస్తంభన అనేది శారీరక మరియు మానసిక సమస్య రెండింటికి సంబంధించినది. ఇదే కాకుండా వెల్లుల్లి మరియు తేనెను తరుచూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్లుల్లి మరియు తేనెతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..
- వెల్లుల్లి అంగస్తంభన మరియు శీఘ్రస్ఖలన సమస్యకు సహజ ఔషధంగా ఉపయోగపడుతుంది.
- బర్మింగ్ హామ్ లోని అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో వెల్లుల్లిలో పాలిసల్ఫైడ్ లు ఉన్నాయని, ఇది హెచ్2ఎస్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని వెల్లడైంది.
- ఇది రక్తనాళాలు విశ్రాంతి తీసుకోవడానికి కారణమవుతుంది. మరియు రక్తపోటును తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తనాళాలను సడలించే వెల్లుల్లి యొక్క సామర్థ్యం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది పరోక్షంగా అంగస్తంభన సమస్యను తగ్గిస్తుంది.
- వెల్లుల్లి మరియు తేనె తీసుకోవడం వల్ల రోగనిరోధశక్తి పెరుగుతుంది.
- వీర్య కణాలు తక్కువగా ఉన్న పురుషులకు వెల్లుల్లి మరియు తేనె బాగా ఉపయోగపడుతుంది. శాస్త్రీయ అధ్యయనం ప్రకారం వెల్లుల్లి మరియు తేనె రెండూ వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి.
- ప్రొస్టెట్ సామర్థ్యం బలహీనంగా ఉన్న పురుషులు వెల్లుల్లి మరియు తేనెను తీసుకోవాలి.
- చాలా మంది యువకులు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అయితే వెల్లుల్లి మరియు తేనె తీసుకోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. దీంతో త్వరగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది.
- మానసిక స్థితిని పెంచడానికి ప్రజలు రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. అయితే వెల్లుల్లి మరియు తేనె తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. కాబట్టి పురుషులు వెల్లుల్లి మరియు తేనెను మూడ్ పెంచే ఆహారంగా తీసుకోవచ్చు.
- వెల్లుల్లి, తేనె తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. డయేరియా, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఎలా తీసుకోవాలి?
నిత్యం మనం వెల్లుల్లిని వంటల్లో ఎక్కువగా వాడుతుంటాం. అదే విధంగా తేనెని కూడా అనేక విధాలుగా వాడుతుంటారు. ఈ రెండింటిలో శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మంచిది. దీన్ని ఎలా తయారు చేయాలంటే..ముందుగా రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని బాగా నలపాలి. దీని వల్ల పోషకాలు రెట్టింపు అవుతాయి. కొన్ని నిమిషాల తర్వాత అందులో తేనె కలిపి పరగడపున తీసుకోవాలి.