ఏపీలో ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాల్లో మూడో జాయింట్ కలెక్టర్ల నియామకంతో పెద్ద సంఖ్యలో బదిలీలు జరిగాయి. అన్ని జిల్లాల నాన్ కేడర్ జేసీలను ఆసరా, వెల్ఫేర్ జేసీలుగా నియమిస్తున్నట్లు చెప్పింది. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పై మరింత పట్టు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణను తీసుకొచ్చింది. అనంతపురం జేసీ ఢిల్లీ రావును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది.
అధికారులు బదిలీ అయిన స్థానాలు..
- శ్రీకాకుళం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా సుమిత్ కుమార్
- శ్రీకాకుళం జేసీ(అభివృద్ధి)గా కె. శ్రీనివాసులు
- విజయనగరం జేసీ( రైతు భరోసా, రెవెన్యూ)గా క్రైస్ట్ కిషోర్ కుమార్
- విజయనగరం జేసీ(అభివృద్ధి)గా మహేశ్ కుమార్
- విశాఖ జేసీ( రైతు భరోసా, రెవెన్యూ)గా వేణుగోపాల్రెడ్డి
- విశాఖ జేసీ (అభివృద్ధి)గా పి. అరుణ్బాబు
- తూర్పు గోదావరి జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా లక్ష్మీషా
- తూ.గో జేసీ (అభివృద్ధి)గా కీర్తి
- పశ్చిమ గోదావరి జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకటరామిరెడ్డి
- పశ్చిమ గోదావరి జేసీ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా
- కృష్ణా జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా మాదవి లతా
- కృష్ణా జేసీ(అభివృద్ధి)గా శంకర్ లతోటి
- గుంటూరు జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా దినేశ్ కుమార్
- గుంటూరు జేసీ (అభివృద్ధి)గా ప్రశాంతి
- ప్రకాశం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకట మురళి
- ప్రకాశం జేసీ (అభివృద్ధి)గా చేతన్
- నెల్లూరు జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వి.వినోద్ కుమార్
- నెల్లూరు జేసీ (అభివృద్ధి)గా ఎన్ ప్రభాకర్రెడ్డి
- చిత్తూరు జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా మార్కండేయులు
- చిత్తూరు జేసీ (అభివృద్ధి)గా వి.వీరబ్రహ్మయ్య
- కడప జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా ఎం.గౌతమి
- కడప జేసీ (అభివృద్ధి)గా సాయికాంత్ వర్మ
- అనంతపురం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా నిశాంత్కుమార్
- అనంతపురం జేసీ (అభివృద్ధి)గా లావణ్యవేణి
- కర్నూలు జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా రవిసుభాష్
- కర్నూలు జేసీ (అభివృద్ధి) ఎస్.రామసుందర్రెడ్డి