ఏపీలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1463 కు చేరింది. ఇప్పటి వరకు 33 మంది మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకుని 403 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1027 మంది ఉన్నారు. 

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 7902 శాంపిల్స్ పరీక్షించగా 60 మంది కోొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. ఏపీలో అత్యధికంగా కర్నూలులో 411 కేసులు, గుంటూరు 306, క్రిష్ణ 246 కేసులు ఉన్నాయి. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు

 

జిల్లాకేసుల సంఖ్య
కర్నూలు 411
గుంటూరు306
కృష్ణా246
చిత్తూరు80
నెల్లూరు84
కడప79
అనంతపురం67
ప్రకాశం60
పశ్చిమ గోదావరి58
తూర్పు గోదావరి42
విశాఖపట్నం25
శ్రీకాకుళం5
విజయనగరం0
మొత్తం1463

 

Leave a Comment