రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1463 కు చేరింది. ఇప్పటి వరకు 33 మంది మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకుని 403 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1027 మంది ఉన్నారు.
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 7902 శాంపిల్స్ పరీక్షించగా 60 మంది కోొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. ఏపీలో అత్యధికంగా కర్నూలులో 411 కేసులు, గుంటూరు 306, క్రిష్ణ 246 కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా కేసుల వివరాలు
జిల్లా | కేసుల సంఖ్య |
కర్నూలు | 411 |
గుంటూరు | 306 |
కృష్ణా | 246 |
చిత్తూరు | 80 |
నెల్లూరు | 84 |
కడప | 79 |
అనంతపురం | 67 |
ప్రకాశం | 60 |
పశ్చిమ గోదావరి | 58 |
తూర్పు గోదావరి | 42 |
విశాఖపట్నం | 25 |
శ్రీకాకుళం | 5 |
విజయనగరం | 0 |
మొత్తం | 1463 |