ఏపీలో కరోనా జోరు..

రాష్ట్రంలో కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది. ఏపీలో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403కు చేరింది. గడచిన 24 గంటల్లో 6497 శాంపిల్స్ సేకరించగా 71 కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43 కేసులు నమోదయ్యాయి. 

దీంతో కర్నూలులో అత్యధికంగా 386 కేసులు, గుంటూరు 287, కృష్ణా జిల్లాలో 246 కేసులు వచ్చాయి. అయితే కోరనా పాజిటివ్ తో ఇప్పటి వరకు 321 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో ఇంకా 1051 మంది చికిత్స పొందుతున్నారు. 

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు..

 

జిల్లాకరోనా కేసులు
కర్నూలు386
గుంటూరు287
కృష్ణా246
నెల్లూరు84
చిత్తూరు80
అనంతపురం61
ప్రకాశం60
కడప73
పశ్చిమ గోదావరి 56
తూర్పు గోదావరి42
విశాఖపట్నం23
శ్రీకాకుళం5
విజయనగరం0

 

Leave a Comment