ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ అదుపులోకి రావడం లేదు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887కు చేరింది. ఇప్పటి వరకు 41 మంది మరణించారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1004 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 842 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గడచిన 24 గంటల్లో అనంతపురం జిల్లా లో 16 కేసులు, కర్నూలు లో 7,గుంటూరు 1, కృష్ణా 6, చిత్తూర్ లో 3, విశాఖలో 11, విజయనగరం లో 1, వెస్ట్ గోదావరి లో 9 కొత్తగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 547 కేసులు, గుంటూరు 374, కృష్ణా జిల్లాలో 322 కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7320 శాంపిల్స్ పరీక్షించగా 54 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..
జిల్లా పేరు | కరోనా కేసుల సంఖ్య |
కర్నూలు | 547 |
గుంటూరు | 374 |
కృష్ణా | 322 |
అనంతపురం | 99 |
నెల్లూరు | 96 |
కడప | 96 |
చిత్తూరు | 85 |
పశ్చిమ గోదావరి | 68 |
ప్రకాశం | 61 |
విశాఖపట్నం | 57 |
తూర్పు గోదావరి | 46 |
శ్రీకాకుళం | 5 |
విజయనగరం | 4 |
ఇతరులు | 27 |
మొత్తం | 1887 |