ఏపీపీ ఉద్యోగాలకు 49 మంది ఎంపిక

ఫలితాలను విడుదల చేసిన హోంమంత్రి సుచరిత

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 50 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను రాష్ట్ర హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత డిజిపి గౌతం సవాంగ్ తో కలిసి విడుదల చేశారు. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయం నాలుగో భవనం ప్రచార విభాగంలో ఈ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 50 ఏపీపీ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించించేందుకు ధరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 2,488 మంది అభ్యర్ధులు దరఖాస్తు  చేయగా వారిలో 1981 మంది రాత పరీ పరీక్షలకు హాజరయ్యరన్నారు. వారిలో 496 మంది రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా వారిలో 97 మందిని మౌఖిక పరీక్షలకు ఎంపిక చేశారన్నారు. వారిలో 49 మందిని ఎంపిక చేశామని తెలిపారు. కాగా జోన్-4లో ఆర్ధోపెడికల్లీ హేండీ కాప్డ్(మహిళ) కేటగిరీ కింద కేటాయించిన ఒక ఏపీపీ ఉద్యోగానికి తగిన అర్హతగల అభ్యర్థి లేకపోవడంతో ఆ పోస్టును భర్తీ చేయలేదని హోంమంత్రి సుచరిత వివరించారు.

ఏపీపీ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 22 మంది పురుషులు, 27మంది మహిళలు అనగా 33 శాతం రిజర్వేషన్లను మించి అనగా 50 శాతం పైగా మహిళలు ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషమని హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఎంపికైన వారిలో ఎం.లావణ్య 281.50 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, సిహెచ్.చంద్ర కిషోర్ 277.3 శాతం మార్కులతో ద్వితీయ స్థానంలోను,తేజశేఖర్ 251 మార్కులతో తృతీయ స్థానంలోను నిలిచారని చెప్పారు.

పీటీసీలో శిక్షణ..

ఎంపికైన అభ్యర్ధులకు వారం రోజుల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పిటిసి)లో శిక్షణకు పంపిస్తామని వెల్లడించారు. అభ్యర్ధులు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షల మార్కులను తెల్సుకునేందుకు www.slprb.ap.gov.in అనే వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆమె సూచించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013లో ఈ ఏపీపీ ఉద్యోగాల భర్తీని చేపట్టడం జరిగిందని చెప్పారు.ఎంపికైన అభ్యర్ధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక అభినందలు తెలియజేశారని పోలీస్ శాఖ తరుపున కూడా అభ్యర్ధులకు ప్రత్యేక అభినందనలు తెలియ జేస్తున్నట్టు సుచరిత పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అందుకు అనుమతి రాగానే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

దిశ చట్టానికి మంచి స్పందన..

దిశ చట్టం గురించి హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన దిశ పత్యేక యాప్ పై మంచి స్పందన వస్తోందని 4వేల ఫోన్ కాల్స్ వస్తే వాటిలో అత్యధిక శాతం ఆయాప్ పనిచేస్తోందలేదోనని పరీక్షించే కాల్స్ అధికంగా వచ్చాయని తెలిపారు.

పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ..

పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ ఏపీపీ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా చర్యలు తీసుకుని సకాలంలో ఫలితాలు వెల్లడించామని తెలిపారు. దిశ చట్టం గురించి ఆయన మాట్లాడుతూ దిశ చట్టం తీసుకురావడతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని, మిగతా చట్టాలన్నీ సక్రమంగా అమలు జరిగితేనే పూర్తిగా సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. దిశ యాప్ పై ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో మంచి స్పందన వస్తోందని డిజిపి పేర్కొంటూ రాష్ట్రాన్ని మహిళా రక్షణ రాష్ట్రం (Women Safety State)గాను, ప్రతి పోలీస్ స్టేషన్ ను స్నేహ పూర్వక మహిళా పోలీస్ స్టేషన్ (Women Friendly)లు తీరిద్దిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Leave a Comment