రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2137కు చేరింది. ఇప్పటి వరకు 47 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 948 మంది ఉన్నారు. కరోనా నుంచి కోలుకుని 1142 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో గుంటూరులో 12, చిత్తూరులో 11, కర్నూలు 7, అనంతపురం 3, తూర్పు గోదావరి 4, క్రిష్ణా జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 కొత్త కేసులు వచ్చాయి. నిన్న 9,284 శాంపిల్స్ పరీక్షించగా 48 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
జిల్లా పేరు | కరోనా కేసుల సంఖ్య | యాక్టివ్ కేసులు |
కర్నూలు | 591 | 277 |
గుంటూరు | 399 | 166 |
క్రిష్ణా | 349 | 133 |
చిత్తూరు | 142 | 68 |
అనంతపురం | 118 | 65 |
నెల్లూరు | 111 | 31 |
కడప | 97 | 41 |
పశ్చిమ గోదావరి | 68 | 30 |
విశాఖపట్నం | 66 | 40 |
ప్రకాశం | 63 | 3 |
తూర్పు గోదావరి | 51 | 16 |
శ్రీకాకుళం | 5 | 1 |
విజయనగరం | 4 | 4 |
ఇతరులు | 73 | 73 |
మొత్తం | 2137 | 948 |
ఒక్క రోజే 122 మంది మృతి..
ఇక ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 3,525 పాజిటివ్ కేేసులు నమోదవ్వగా, 122 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,281 కు చేరాయి. ఇప్పటి వరకు 2415 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు 24,386 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.