ఇక 17 ఏళ్లకే ఓటర్ కార్డు.. ఈసీ కీలక నిర్ణయం!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.. ఈ మేరకు ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. సాధారణంగా ఓటర్ జాబితాలో పేరు నమోదుకు తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి.. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసున్న వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.. కానీ ఓటర్ కార్డు కోసం 18 ఏళ్ల నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ఈసీ ప్రకటించింది..ఇందుకోసం ఆర్పీ యాక్ట్ 1950లోని సెక్షన్ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్, 1960 చట్టాల్లో మార్పులు చేసింది. 

యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1వ తేదీల్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. ప్రతి త్రైమాసికానికి ఓటర్ జాబితాను అప్ డేట్ చేస్తారు. దీంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ కార్డు జారీ చేస్తారు. 2023లో ఏప్రిల్ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ల నిండే ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ గా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

అంటే.. 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఓటర్ కార్డు మాత్రం 18 ఏళ్లు నిండిన తర్వాతే అందిస్తారు..ఇక ఓటర్ నమోదు దరఖాస్తు ఫారాలను సైతం యూజర్ ఫ్రెండ్లీగా మార్చనుంది.. కొత్త దరఖాస్తు ఫారాలు 2022 ఆగస్టు 1 తర్వాత అందుబాటులోకి రానున్నాయి.. 

Leave a Comment