ఏపీలో కొత్తగా 17 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటిక్ కేసుల సంఖ్య 40 కి చేరింది. మొత్తం 147 శాంపిళ్లు పరీక్షిస్తే 17 కేసులు పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ లో వెల్లడించింది. ఇప్పటి వరకు 748 కేసులను పరీక్షించారు. తాజా కేసుల్లో 9 మంది ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న వారు కాగా, మిగితావి వారి బంధువులు, కంటాక్ట్ కేసులు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో పదేళ్ల బాలుడికి కరోనా సోకినట్లు తెలిసింది.
జిల్లాల వారీగా మొత్తం కేసులు
ప్రకాశం – 11
గుంటూరు- 9
విశాఖ – 6
కృష్ణా – 5
తూర్పు గోదావరి -4
అనంతపూర్ – 2
నెల్లూరు, చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి