ఈ పాపడ్ తిని కరోనాను జయించండి : కేంద్ర మంత్రి

ప్రపంచం మొత్తం కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తోంది. అయితే కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆయన భాబీజీ పాపడ్ ను లాంచ్ చేశారు. ఆ సందర్భంలో ఆయన అన్న మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ఆయన ఏమన్నారంటే..

‘భాబీజీ పాపడ్ తింటే కరోనాను పరార్ అవుతుంది. ఈ పాపడ్ లో కరోనా వైరస్ తో పోరాడే యాంటీ బాడీలను ప్రేరేపించేందుకు ఊతమిచ్చేలా ఈ ఉత్పత్తిని పాపడ్ తయారీదారులు ప్రజల ముందుకు తీసుకొచ్చారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఉత్పత్తి చేపట్టిన తయారీదారులను ఆయన అభినందించారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి ప్రచారం చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాపడ్ గురించి తెలియక ప్రపంచం వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Leave a Comment