‘ఇండియాలో మాత్రమే ఇలాంటివి సాధ్యం’.. వైరల్ అవుతున్న సీరియల్ సీన్..!

మన ఇండియాలో రపొందించే సీరియల్స్ లోని సీన్లు చూస్తే అసలు నిజజీవితానికి సంబంధమే ఉండదు.. అలా రూపొందిస్తున్నారు. తాజాగా ఓ టీవీ సీరియల్ లోని సీన్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ హిందీ ఛానెల్ లో ‘తాప్ కీ ప్యార్ కీ’ అనే సీరియల్ ప్రసారమవుతోంది. ఆ సీరియల్ లోని ఓ సీన్ లో ఒక మహిళ అద్దం ముందు నిలబడి ఉంటుంది. ఆ సమయంలో ఆమె భర్త కాలు జారీ కింద పడిబోతాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది.. అతడు కిందపడిబోతు బ్యాలెన్స్ చేసుకుంటుండగా.. అతని చేతి వేళ్లు కుంకుమ ఉండే బాక్స్ లోపలికి వెళ్తాయి. ఆ పయత్రంలోనే అతడి భార్య నుదటి మీద బొట్టు పెడతాడు.. 

ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఫేస్ బుక్ లో ఈ వీడియో మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. అయితే ఈ సీన్ ను నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇండియన్ సీరియల్స్ లో మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయి.. ఇద్దరు నటులకు హ్యాట్సాఫ్..సీన్ చేసేటప్పుడు నవ్వకుండా ఎలా ఉన్నారో.. నిజ జీవితానికి ఏమాత్రం దగ్గరగా లేదు.. టీవీల్లో వచ్చే ఇలాంటి సీన్లను బ్యాన్ చేయాలంటే ఏం చేయాలో చెప్పండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Leave a Comment