స్పెషల్ ఒలింపిక్స్ లో భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్..!

కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్.. ఎవరికి ఏం సాయం కావాలన్నా వెంటనే చేసిపెట్టాడు. తన సేవా కార్యక్రమాలతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. తాజాగా ఈ రియల్ హీరోకు అరుదైన గౌరవం లభించింది. 

వచ్చే ఏడాది రష్యాలో జరిగే స్పెషల్ ఒలింపిక్స్ లో భాగంగా భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ఎంపికయ్యారు. రష్యాలోని కజాన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 22 నుంచి వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్ కు హాజరయ్యే ఇండియన్ అథ్లెట్ల బృందానికి సోనూసూద్ నాయకత్వం వహించనున్నారు. 

భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికవడం పట్ల సోనూసూద్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. స్పెషల్ ఒలింపిక్స్ భారత్ బృందంతో చేరడం నాకు గర్వంగా ఉంది. ఈ సందర్భంగా ఎస్వో భారత్ జట్టుకు ముందస్తు అభినలు తెలుపుతున్నాను’ అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.  

Leave a Comment