నారా వారి నరాలు చిట్లిపోతున్నాయి : రోజా

జగన్ పాలను చూసి నారా వారి నరాలు చిట్లి పోతున్నాయని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి్ర జగన్ ది ఉన్మాద పాలన అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని, వీరు చేసిన తప్పులకి జైలుకు వెళ్లే అవకాశం ఉందని రోజా వ్యాఖ్యానించారు. ఐటీ సోదాలను డైవర్ట్‌ చేయడానికి ప్రజా చైతన్య యాత్ర చేపట్టారన్నారు. ప్రకాశం జిల్లాలో మైనింగ్‌ లో మొత్తం టీడీపీ నేతలే ఉన్నారన్నారు. ‘ఎవరిది ఉన్మాద పరిపాలనో ప్రజలు ఎన్నికల్లో చెప్పారు. 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబును మూలన కూర్చోబెట్టారు.  ఏ అవసరం ఉందని ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారు? ఇది ప్రజా చైతన్య యాత్ర? ప్రజలు చీకొట్టిన పిచ్చోడి యాత్ర?’ అని వ్యాఖ్యానించారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గొప్ప ఆలోచనలతో జగన్‌ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మద్యం పాలసీపై చంద్రబాబు నాయుడు తాగు బోతుల సంఘానికి అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారన్నారు. జగన్‌పై బురద ఎలా చల్లాలనే విషయంపై భూతద్దాలతో వెతుకుతున్నారని విమర్శించారు.

Leave a Comment