పవన్ కళ్యాణ్ ని బండ బూతులు తిట్టిన పోసాని..!

రిపబ్లిక్ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ నటుడు  పోసాని కృష్ణమురళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే.. దీంతో పవన్ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేస్తూ మెసేజ్ లు చేస్తున్నారని పోసాని మంగళవారం రెండో సారి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు. పవన్ ప్యాన్స్ సైకోలుగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. 

రాజకీయాల్లో ఆరోపణలు చేయడం సహజమేనని, గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను తిట్టారని, అప్పుడు కేసీఆర్ పవన్ కు వార్నింగ్ ఇచ్చారని అన్నారు. తాను మొదటి నుంచి జగన్ అభిమానినని, ఓ ఫ్యాన్ లా తాను రియాక్ట్ అయ్యానని అన్నారు. నిన్నటి నుంచి నాకు ప్రతి సెకండ్ ఫోన్లు వస్తున్నాయని, బూతులు తిడుతున్నారని, అభిమానులను అడ్డుపెట్టుకుని పవన్ నియంతలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. రాజకీయాలకు, ఇంట్లో వారికి సంబంధం ఏంటని, చిరంజీవిపై కేశినేని కామెంట్స్ చేసినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. 

పవన్ కళ్యాణ్ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని పోసాని మండిపడ్డారు. ఎవరో ఫంక్షన్ పెట్టుకుంటే అక్కడికి పవన్ ఫ్యాన్స్ ఎందుకు వస్తున్నారని పోసాని ఫైర్ అయ్యారు. తన భార్య పనోడితో అక్రమసంబంధం పెట్టుకుందని పవన్ ఆరోపించారని, ఇది తన వ్యక్తిగత విషయాలని అన్నారు. ఈక్రమంలో పవన్ కళ్యాన్ ని బండబూతులు తిట్టారు. ‘పవన్ కళ్యాణ్ అనే సైకోవెదవకి చెబుతున్నా.. ఒరేయ్ సైకో వెదవ నీకూ ఆడపిల్ల ఉంది.. ఆ పిల్ల పెద్దదవుతుంది.. గుర్తుపెట్టుకో నేను బతికే ఉంటా.. రక్త కన్నీరు పెట్టుకుంటావు.. దరిద్రపు నా కొడకా.. నా భార్యను అన్ని మాటలు అన్నందుకు నిన్ను ఏమైనా అనోచ్చురా’ అంటూ పోసాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. 

Leave a Comment