జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించారు. ముందుగా రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ కి పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్.. రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా నర్సాపురం చేరుకున్నారు.
ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కి ఊహించని పరిణామం ఎదురైంది. నర్సాపురం చేరకున్నా పవన్.. తన కాన్వాయ్ పైకి నిల్చుని ప్రజలకు, తన అభిమానులకు అభివాదం చేశారు. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక్కసారిగా కాన్వాయ్ పైకి ఎక్కి పవన్ పై పడిపోయాడు. దీంతో పవన్ కళ్యాణ్ బొక్కా బోర్లా పడిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ilanti abhimanam manchida ? @PawanKalyan anna ki emaina ayunte akkada ?
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ✍️ (@Harinani_) February 20, 2022