కడచూపు కోసం తరలివచ్చిన తారలు.. సిరివెన్నెలకు సినీ ప్రముఖుల నివాళి..!

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కడసారి చూపుకోసం సినీ ప్రముఖులు తరలివచ్చారు. సీతారామశాస్త్రి అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే.. బుధవారం ఆయన భౌతికకాయన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకొచ్చారు. ఈక్రమంలో సీని ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. 

చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, రానా దగ్గుబాటి, జగపతిబాబు, నాగబాబు, శ్రీకాంత్, రాజశేఖర్, శర్వానంద్, పలువురు నిర్మాతలు, దర్శకులు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు.

  • సిరివెన్నెల సీతారామశాస్త్రి లేకుండా తెలుగు సినిమా పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉందని మహేశ్ బాబు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు.
  • సీతారామశాస్త్రి మరణం చాలా బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. ‘రుద్రవీణ’ రోజుల నుంచే ఆయన తనకు పరియమన్నారు. ‘జానీ’ సినిమా పాటల కోసం కూర్చున్నప్పుడు సాహిత్యం, విలువల గురించి మాట్లాడుకునేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. అలాంటి కవి, సాహితీవేత్త కన్నుమూయడం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నివాళి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఏపీ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. ఏపీ ప్రభుత్వం తరఫున సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

Leave a Comment