సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు మంచు మహన్ బాబుపై జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ వ్యాఖ్యలపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.
‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి. అందుకని ఏకవచనంతో సంబోధించాను. పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమిలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతన ప్యానల్ కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను.’ అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021