భర్త కుట్టిన జాకెట్ నచ్చలేదని భార్య ఆత్మహత్య..!

ఇటీవల చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడేవారు ఎక్కువయ్యారు. తాజాగా భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు శ్రీనివాసులు, విజయలక్ష్మి(35) దంపతులు. వీరు గోల్నాక తిరుమలనగర్ లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు..

కాగా శ్రీనివాసులు టైలరింగ్ పనిచేసుకుంటూ.. బైక్ పై తిరుగుతూ చీరలు అమ్ముతుంటాడు. శనివారం తన భార్య కోసం ఓ జాకెట్ కుట్టాడు. అయితే ఆ జాకెట్ నచ్చలేదని భార్య చెప్పింది. ఈ విషయంలో చిన్న గొడవ జరిగింది. జాకెట్ కుట్లు విప్పి నీకు నచ్చినట్లు కుట్టుకో అని శ్రీనివాసులు చెప్పాడు. 

దీంతో మనస్తాపం చెందిన విజయలక్ష్మి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపుతు వేసుకుంది. శ్రీనివాసలు తన పని తాను చేసుకుంటున్నాడు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు తలుపు తట్టగా ఆమె తీయలేదు. దీంతో బలవంతంగా తలుపులు తోసి చూస్తే.. విజయలక్ష్మీ ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment