ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్..మెగాస్టార్ కీలక నిర్ణయం..!

కరోనా సెకండ్ వేవ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోనూ ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’లను నెలకొల్పాలని నిర్ణయించారు.

 ఈ విషయాన్ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. వచ్చే వారం రోజుల్లో ప్రజలకు ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలు, నిర్వహణను హీరో రామ్ చరణ్ చూసుకోనున్నట్లు తెలుస్తోంది.. 

Leave a Comment