బాలివుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

బాలివుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారు. పెద్ద ప్రేగు సంబంధిత వ్యాధితో ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరిన ఇర్ఫాన్ ఖాన్ బుధవార మరణించారు. ఇర్ఫాన్ కు భార్యా సుతాపా మరయు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మంగళవారం ఇర్ఫాన్ ఖాన్ మరణించినట్లు పుకార్లు వచ్చాయి. వాటిని ఆయన కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. 

కొన్ని నెలల క్రితం ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ తో పోరాడి లండన్ లో చికిత్స పొంది తరువా భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఇర్ఫాన్ తల్లి సయిదా బేగం శనివారం జైపూర్ లో మరణించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియాల్లో పాల్గొనలేక పోయారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన తల్లికి నివాళులర్పించారు. 

ఇర్ఫాన్ ఖాన్ చివరిసారిగా ఆంగ్రేజీ మీడియం సినిమాలో నటించాడు. ఈ సినిమా భారతదేశంలో లాక్ డౌన్ విధించడానికి వారం ముందు విడుదలైంది. ఆయన మృతి పలువురు బాలివుడ్ నటులు సంతాపం తెలిపారు. 

Leave a Comment