ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన వ్యక్తిగత అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వరు. కరోనా కారణంగా 2020 ఏప్రిలో హరిద్వార్ లో జరిగిన తన తండ్రి అంత్యక్రియలకు సైతం యోగి హాజరుకాలేదు.. అలాంటిది.. దాదాపు 28 సంవత్సరాల తర్వాత యోగి ఆదిత్యనాథ్ తన సొంతూరుకు వెళ్లారు. తన కుటుంబంలో జరిగిన ఓ కార్యక్రమం కోసం ఆయన స్వస్థలం పౌరికి వెళ్లారు..
అక్కడ తన తల్లి సవిత్రా దేవిని యోగి ఆదిత్యనాథ్ కలిశారు. తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక తన తల్లిని కలుసుకోవడం ఇదే తొలిసారి.. తల్లి ఆశీర్వాదం తీసుకున్న యోగి ఆమెతో ఆప్యాయంగా గడిపారు. యోగి తన తల్లిని కలుసుకున్న ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు.
माँ pic.twitter.com/3YA7VBksMA
— Yogi Adityanath (@myogiadityanath) May 3, 2022