ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ని తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో యజస్వీ జైస్వాల్ భారత్ తరఫున బెస్ట్ ర్యాంకర్ అయ్యాడు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో రాణించిన యజస్వి జైస్వాల్ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రిషబ్ పంత్ కూడా ర్యాంకింగ్స్ లో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ర్యాంకులు పడిపోయాయి.
శ్రీలంకతో తొలి టెస్టులో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ర్యాంకుల్లో కిందికి వెళ్లారు. ఐసీపీ టెస్టు ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ ఐదో ర్యాంకు నుంచి పదో ప్లేస్ కి పడిపోయాడు. ఇక బంగ్లాతో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో విఫలమైన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఏకంగా ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్-10 నుంచి ఔట్ అయ్యాడు. ఐదు స్థానాలు కోల్పోయి 12వ ర్యాంకుకు పడిపోయాడు.
బంగ్లాదేశ్తో మ్యాచ్తో 21 నెలల తర్వాత టెస్టు క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. బంగ్లాతో మ్యాచ్లో సెంచరీతో కదంతొక్కాడు. దీంతో ఏకంగా ఆరో ర్యాంకుకు వచ్చేశాడు.
టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్ల్లో ఇంగ్లండ్ సీనియర్ జో రూట్ టాప్లో ఉండగా.. న్యూజిలాండ్ ప్లేయర్లు కేన్ విలియమ్స్, డారిల్ మిచెల్ రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. నాలుగో ప్లేస్లో ఆసీస్ స్టార్ స్మిత్ ఉండగా.. ఐదు, ఆరు ర్యాంకులకు జైస్వాల్, పంత్ చేరారు.
ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫస్ట్ ర్యాంకును పదిలం చేసుకున్నాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో ర్యాంకుకు వచ్చాడు. ఆసీస్ పేసర్ జోస్ హాజిల్వుడ్ మూడో ర్యాంకుకు పడిపోయాడు. టెస్టు ఆల్రౌండర్ ర్యాంకింగ్ల్లో జడేజా, అశ్విన్ తొలి రెండు ర్యాంకుల్లో కంటిన్యూ అయ్యారు. టెస్టు టీమ్ ర్యాంకింగ్ల్లో భారత్ రెండో ప్లేస్లో కొనసాగింది.