నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన వైవి.సుబ్బారెడ్డి..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సోమవారం కలిశారు. టీటీడీ వద్ద ఉన్న పాత రద్దయిన నోట్లను మార్పిడి చేయాలని కోరారు. నోట్ల రద్దుతో 50 కోట్ల రూపాయలు ఉండిపోయాయన్నారు. భక్తులు కానుకలు డబ్బుల రూపంలో మార్చేందుకు అనుమతించాలని కోరారు. లాక్ డౌన్ కారణంగా టిటిడికి రెవెన్యూ  లేదని, కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు, వెనకబడిన జిల్లాలకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

 

Leave a Comment