ముగ్గురికి ఒకేసారి చెక్ చెప్పిన చహల్..!

ఆర్సీబీ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ క్రికెటర్ కాకముందు చెస్ క్రీడాకారుడిగా ఉన్నాడు. అండర్-12 చెస్ విభాగంలో చహల్ పలుసార్లు చాంపియన్ గా కూడా నిలిచాడు.. తర్వాత చెస్ ను వదిలేసి క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు.. తాజాగా ఆర్సీబీలో తన సహచర ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, మహ్మద్ సిరాజ్, సుందర్ లతో సరదాగా చెస్ ఆడాడు..

అయితే ఈ ముగ్గురికి ఒకే సారి చెక్ చెప్పాడు చహల్.. దీంతో ముగ్గురు ఆశ్చర్యపోయారు.. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ‘నా కింగ్ ఫామ్ లో ఉన్నాడు.. అందుకు ముగ్గురికి ఒకేసారి చెక్ చెప్పా’.. అంటూ క్యాప్షన్ జతచేశాడు.. అంతేగాక చిన్నప్పటి నుంచి చెస్ ఆడటం వల్ల ఇప్పుడు మైదానంలో మ్యాచ్ ఆడేటప్పుడు ఓపిక ఎంత అవసరమనేది నేర్చుకున్నానని చెప్పాడు.. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment