రాష్ట్రంలో మరో పెద్ద పథకం.. 28న ప్రారంభం..!

రాష్ట్రంలో మరో పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని సన్న, చిన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే  ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని ఈనెల 28న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని సన్న, చిన్న కారు రైతులను ఆదుకోవడంతో పాటు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ఉచిత బోర్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98 లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలని నిర్ణయించారు.

  • ఉచిత బోర్లకు సంబంధించి అవసరం ఉన్న, అర్హులైన వారు ఆన్ లైన్ ద్వారా గానీ, గ్రామ సచివాలయాల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించిన వెబ్ సైట్ ను ఈనెల 28న సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఆన్ లైన్ విధానంతో పాటు ఎంపీడీవోల ద్వారా నేరుగా దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. 
  • అర్హత ప్రమాణాల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి తర్వాత హైడ్రోజెలాజికల్ మరియు జియోఫిజికల్ సర్వే, సాధ్యాసాధాల ఆధారంగా ఉచిత బోర్లు పనులు ప్రారంభిస్తారు. 
  • వైఎస్సార్ జలకళ పథకం కోసం రైతు దరఖాస్తును సమర్పించిన తర్వాత దరఖాస్తు ప్టేటస్ ను రైతులకు వారు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. 
  • వైఎస్సార్ జలకళ పథకం పర్యవేక్షించడానికి సాఫ్ట్ వేర్ అప్లికేషన్ కూడా అభివృద్ధి చేశారు. దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసిన నాటి నుంచి పని పూర్తి అయిన తర్వాత కాంట్రాక్టర్లకు చెల్లింపుల వరకు పూర్తి పారదర్శకంగా ఉంటుందని రాష్ట్ర పౌర సంబంధాల, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 

 

Leave a Comment