వైఎస్సార్ జలకళ.. ఉచిత బోర్లకు మార్గదర్శకాలు ఇవే..

ఏపీ సీఎం జగన్ మరో పథకానికి శ్రీకారం చుట్టారు. మెట్ట భూములకు సాగు నీరు అందించేందుకు ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. అయితే ఈ ఉచిత బోర్లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. 

ఉచిత బోర్లకు మార్గదర్శకాలు ..

  • గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను తొలుత వీఆర్వో పరిశీలిస్తారు.  
  • అక్కడి నుంచి అవి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. 
  • ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. 
  • అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. 
  • అనుమతి ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ బోరు బావులను తవ్వుతారు. 
  • ఒకసారి బోర్ వెల్ విఫలమైతే మరోసారి కూడా బోర్ వేస్తారు.
  • ఈ పథకం కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్ నిర్వహిస్తారు.
  • ఇక ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో పీఎంయూ(ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్) ఏర్పాటు చేస్తారు.
  • ఇక ఆ బోర్ వేయడం పూర్తయిన తర్వాత చివరగా కాంట్రాక్టర్ తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్ తో డిజిటల్ ఫొటోను తీస్తారు..

Leave a Comment