వివేకా హత్య కేసులో.. కీలక సాక్షి అనుమానాస్పద మృతి..!

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అప్పట్లో ఓ సంచలనం.. ఈ హత్య కేసులు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షి గంగాధర్ రెడ్డి(49) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో నిద్రలోని చనిపోయారు.. బుధవారం రాత్రి నిద్రోపోయిన గంగాధర్ రెడ్డి ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. 

గంగాధర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. గంగాధర్ మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వివేకా హత్య కేసులో గంగాధర్ రెడ్డి సాక్షిగా ఉండటంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Leave a Comment