ఓ మంచి కూతురిలా ఉండలేకపోయాను.. నన్ను క్షమించండి..మనవేదనతో యువతి ఆత్మహత్య..!

అమ్మానాన్నల కోసం ఏమీ చేయలేకపోయాననే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు తిరుపతిలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన గంగమ్మ, గంగాధర్ కుమార్తె దేశమ్మ(21) వాలంటీర్ గా పనిచేసుకుంటూ గ్రూప్స్ రాసేందుకు సిద్ధమవుతోంది. 

ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం ఆమె వాకింగ్ కు వెళ్లింది. వాకింగ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన ఆమె తలుపులు వేసుకుని ఇంట్లో ఉన్న దూలానికి చీరతో ఉరివేసుకుంది. ఇంట్లో రోజూలాగే చదువుకుంటోందని తల్లిదండ్రులు భావించారు. కానీ ఎంత సేపటికీ బయటకు రాలేదు. 

దీంతో అనుమానం వచ్చి వారు బలవంతంగా తలుపులు తెరిచారు. అంతే తమ కూతురు దూలానికి వేలాడుతూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాసింది. దానిని చేతిలో పెట్టుకుంది. ‘నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. కానీ మీ కోసం నేను ఏమీ చేయలేకపోయాను. మిమ్మల్ని ఎప్పుడూ సంతోష పెట్టలేకపోయాను. ఓ మంచి కూతురిలా ఉండలేకపోయాను. నన్న క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. అంటూ సూసైడ్ నోట్లో రాసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment