ప్రేమించిన యువతి మాట్లాడలేదని ఆత్మహత్య..!

ప్రేమించిన యువతి మాట్లాడటం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు కర్నూలులోని కొత్తపేటకు చెందిన నిఖిల్ కుమార్ స్థానిక లక్ష్మీ బిల్డర్స్ లో ఉన్న ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్నాడు. 

నిఖిల్ కొంత కాలంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వారం రోజులుగా మాట్లాడుకోవడం లేదు. ప్రేమించిన యువతి మాట్లాడకపోయే సరికి నిఖిల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పనికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి శనివారం బయటికి వెళ్లాడు. 

ఆదివారం ఉదయం తుంగభద్ర రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత పంచలింగాల దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో నిఖిల్ శరీరం నుజ్జునుజ్జు అయింది. మృతదేేహాన్ని గుర్తించిన కీమెన్.. స్టేషన్ మాస్టర్ కు సమాచారమిచ్చాడు. ఆయన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

Leave a Comment