ఉరేసుకొని యువ క్రికెటర్ ఆత్మహత్య..!

ముంబైకి చెందిన ఓ యువ క్రికెటర్ క్రికెట్ కెరీర్ పట్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువ క్రికెటర్ కరణ్ తివాతీ(27) ఉత్తర ముంబైలోని మలాద్ ప్రాంతంలో తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే..కరణ్ ముంబై ప్రొఫెషనల్ జట్టుకు నెట్ ప్రాక్టీస్ బౌలింగ్ చేస్తాడు. అయితే కరోనా వల్ల క్రికెట్ టోర్నీలు వాయిదాపడ్డాయి. కరణ్ కు ఐపీఎల్ లో కూడా ఏ జట్టులోనూ చోటు దక్కలేదు.  దీంతో కరణ్ తన కెరీర్ పట్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చివరికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కరన్ తివాతీది మధ్య తరగతి కుటుంబం. క్రికెట్ లో సరైన అవకాశాలు రావడం లేదని, తన జీవితాన్ని ముగించాలనుకుంటున్నానని కరణ్ స్నేహితుడికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ముంబై సీనియర్ టీంలో చోటు కోసం ప్రయత్నించి కరణ్ విఫలయ్యాడు. దీనికి తోడు కరోనా వైరస్ కారణగా మ్యాచులు నిలిచిపోయాయి. దీంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యుకు పాల్పడినట్లు తెలుస్తోంది.  

Leave a Comment