రక్తదానంలో వైసీపీ వరల్డ్ రికార్డ్..!

ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వైసీపీ శ్రేణుల పిలుపు మేరకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో రక్తదానం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన రక్తదాన కార్యక్రమం అరుదైన రికార్డు నమోదు చేసింది.

 ఏకంగా ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషన్’లో చోటు దక్కించుకుంది. 34,723 యూనిట్లతో 12,153 లీటర్ల రక్తాన్ని సేకరించి రికార్డు నమోదు చేసింది. ఈ రక్తదాన సేకరణ ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని, దీనికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కల్పిస్తున్నట్లు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషన్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ ప్రకటించారు. ఇంత పెద్దఎత్తున రక్తదాన కార్యక్రమం చేయడం ఇదే తొలిసారి అని అన్నారు.  

 

Leave a Comment