‘ఈ భార్యలు ఏడు జన్మలు కాదు.. ఏడు సెకన్లు కూడా మాకొద్దు దేవుడా’.. 

 ఇటీవలి కాలంలో భర్తలు వేధించే భార్యలే కాదు.. భార్యలు వేధించే భర్తలు కూడా ఉన్నారు. భార్య వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భార్యలు పెట్టే టార్చర్ భరించలేక చాలా మంది వేదనకు గురవుతున్నారు. అలా భార్యల ద్వారా వేధింపులకు గురైన వారంతా కలిసి ఇప్పటికే పలు సంఘాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదే భార్య బాధితుల సంఘం.. 

ఈ భార్య బాధితులంతా కలిసి వింత పూజలు చేశారు. వినూత్న నోములు నోచుకున్నారు. సాధారణంగా వట సావిత్రి పౌర్ణమి నాడు మహిళలు ఏడు జన్మలకు ఒక్కరే భర్తగా రావాలని పూజలు చేస్తుంటారు. కానీ, భార్య బాధితుల సంఘ సభ్యులు మాత్రం.. వింత పూజలు చేశారు. ఏడు జన్మలు కాదు.. ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు దేవుడా.. అంటూ పూజలు చేశారు.

ఈ భార్యలు మాకొద్దు అంటూ రావి చెట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. దేవుణ్ని అర్థించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Leave a Comment