గర్భం దాల్చిన వివాహిత.. నేనే తండ్రి అంటూ కొట్టుకున్న ఇద్దరు లవర్స్.. ఒకరు మృతి..!

ఓ మహిళ గర్భం దాల్చితే.. ఇద్దరు యువకులు సంబరాలు చేసుకున్నారు. ఆమెకు కాబోయే బిడ్డకు తండ్రి నేనంటే నేను అని కొట్టుకున్నారు. ఈ గొడవలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల మేరకు తమిళనాడులోని సేలం జిల్లా అయోధ్య పట్టణంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన మురుగేశన్ అనే వ్యక్తి కలైమణి అనే యువతని కొంతకాలం క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు.

అయితే కలైమణి మాత్రం పెళ్లికి ముందు నుంచి అరసన్, కృపైరాజ్ అనే ఇద్దరు యువకులతో సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. దీంతో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. కలైమణికి పుట్టబోయే బడ్డకు తండ్రి తానేంటే తాను అని ఇద్దరు గొడవకు దిగారు. ఈ గొడవలో అరసన్ కత్తితో కృపైరాజ్ పై దాడి చేశాడు. దీంతో కృపైరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కలైమణి, అరసన్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బక్రా అయింది మాత్రం మురగేశన్… 

Leave a Comment