చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.10 కోట్లతో మహిళ జంప్..!

చిట్టీల పేరుతో ఓ మహిళ భారీ మోసానికి పాల్పడింది. సుమారు రూ.10 కోట్లు వరకు వసూలు చేసి పారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని చంద్రాయణగుట్ట పటేల్ నగర్ లో సీఆర్పీఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ గా రిటైరైన బాబురావు, ఆయన భార్య అంజలి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.  అంజలి స్థానికంగా చిట్టీలు, వడ్డీ వ్యాపారం నిర్వహించేది. 

ఆ కాలనీలో ఆమె చాలా కాలం నుంచి ఉండటంతో కాలనీ వాసులు పెద్ద మొత్తంలో చిట్టీలు వేసేవారు. గత 20 ఏళ్లుగా ఆమె ఈ వ్యాపారాన్ని నమ్మకంగా కొనసాగించింది. అధిక వడ్డీ ఆశ చూపించిన అంజలి రూ.కోట్లలో వసూలు చేసింది. రెండు రోజుల నుంచి అంజలి, ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించడం లేదు. 

ఫోన్ ద్వారా సంప్రదించినా స్పందించకపోవడంతో చిట్టీలు వేసిన వారందరూ ఆందోళనకు గురయ్యారు. బాధితులంతా శుక్రవారం చంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసపోయిన డబ్బు కోట్ల రూపాయలలో ఉండటంతో పోలీసులు ఈ కేసును హైదరాబాద్ సీసీఎస్ కు బదిలీ చేశారు. అంజలి వద్ద దాదాపు రెండు వదల మంది వరకు చిట్టీలు కట్టినట్లు తెలుస్తోంది. అంజలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Leave a Comment