నిత్య పెళ్లికొడుకు.. చర్చికి వచ్చే 19 మంది మహిళలను మోసం చేశాడు..!

పెళ్లి పేరుతో చర్చికి వచ్చే మహిళలను మోసం చేస్తున్న విలియమ్స్ ను అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 19 మంది మహిళలను ఇలా మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు బాప్టిస్టు చర్చిలో డ్రమ్స్ వాయించే మత ప్రచారకుడు, వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్సీషియన్ గా పనిచేస్తున్న టీఎస్ విలియమ్స్ పెళ్లి పేరుతో యువతులను మోసగిస్తూ పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని మహిళ ఆరోపించింది..

నల్గొండలోని ఓ చర్చిలో పియానో వాయించే విలియమ్స్ అక్కడికి వచ్చే యువతులు, మహిళలను మాయమాటలతో లోబరుచుకొని పెళ్లి పేరుతో మోసం చేస్తున్నాడు. ఇలా ఏకంగా 19 మంది మహిళలను పెళ్లిచేసుకున్నాడు. అయితే మొదటి భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తుండగా గుండెపోటు వచ్చిందని విలియమ్స్ ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్య పరీక్షల్లో గుండెపోటు వచ్చినట్లు నిర్ధారణ కాకపోవడంతో పోలీసులు విలియమ్స్ ను అరెస్ట్ చేశారు.

Leave a Comment