భార్యకు కోపం వచ్చి.. ఏకంగా భర్త మర్మాంగాన్నే కోసేసింది..!

భర్త మీద కోపంతో ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. వేధింపులు తట్టుకోలేక తన భర్త మర్మాంగాన్ని కోసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల రెవెన్యూ పరిధిలోని తండాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు భర్త బిచ్యానాయక్ (45), ప్రమీల భార్యాభర్తలు. ఇద్దరి మధ్య తరచూ గొడవు జరుగుతూ ఉండేవి. నిత్యం ఏదో ఒక కారణంతో భార్యను వేధించేవాడు బిచ్యానాయక్. 

ఈ వేధింపులను తట్టుకోలేకపోంది ప్రమీల. ఓ రోజు రాత్రి తన భర్త నిద్రపోతుండగా అతడి మర్మాంగాన్ని కోసేసింది. దీంతో అతడు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూశారు. అప్పటికే అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బిచ్యానాయక్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రతి రోజూ గొడవలు, తగాదాలతో విసిగిపోయిన ప్రమీల రాత్రి నిద్రపోతున్న తన భర్త మర్మాంగం భాగంలో కొడవలితో కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.   

Leave a Comment