పాక్ విజయంపై భార్య ఆనందం..పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త..!

టీ20 ప్రపంచకప్ లో భాగంగా అక్టోబర్ 24న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమి చెందింది. ఈ ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపాయారు. అయితే ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ మహిళ పాకిస్తాన్ విజయంపై సంబరాలు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఉత్తరప్రదేశ్ రామ్ పుర్ కు చెందిన ఇషాన్ మియాన్ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ను ఢిల్లీలో తన స్నేహితులతో కలిసి చూశాడు. అయితే టీమిండియాలో ఒటమి చెందడటంతో మిగితా భారత అభిమానుల్లానే డీలా పడిపోయాడు. అదే సమయంలో తన వాట్సాప్ చూడగా.. అందులో పాక్ గెలుపును ఆనందిస్తున్నట్లు తన భార్య రబియా స్టేటస్ పెట్టింది. దీంతో కోపంతో ఇషాన్ మియాన్ రామ్ పుర్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. తన భార్యపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. రబియా స్టేటస్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.  

 

Leave a Comment